ప్రైవేట్‌ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు?: హరీశ్‌రావు | Harish Rao Questions 22A Banned Lands In Malkajgiri | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు?: హరీశ్‌రావు

Aug 18 2026 11:49 AM | Updated on Aug 18 2026 11:59 AM

 Harish Rao Questions 22A Banned Lands In Malkajgiri

హైదరాబాద్‌: ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములుగా నిర్ణయించి, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. మల్కాజ్‌గిరిలో పర్యటించిన ఆయన.. భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రైవేట్‌ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. సంబంధిత భూ యజమానుల నుంచి ఎలాంటి దరఖాస్తులు లేకుండానే ప్రైవేట్‌ భూములను 22ఏలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ఇప్పటికే అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (ULC)లో పరిష్కారమైన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కారణమేంటని ఆయన నిలదీశారు.

ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భూముల యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే, ప్రజల ఆస్తులపై ప్రభుత్వ తప్పిదాల ప్రభావం పడితే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

దీంతో ప్రభుత్వ తప్పిదానికి ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారని వారు నిలదీశారు. అయితే, భూముల రికార్డులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రైవేట్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement