మలేరియా నియంత్రణలో రాష్ట్రానికి జాతీయ గుర్తింపు

State Govt Malaria Control National Recognition: Harish Rao - Sakshi

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం   

సాక్షి, హైదరాబాద్‌: మలేరియాను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015–21) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని, దీంతో తెలంగాణ కేటగిరీ–2 నుంచి కేటగిరీ–1లోకి చేరిందని కేంద్రం ప్రశంసించింది. ‘సత్కారాన్ని అందుకునేందుకు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపింది’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top