సాక్షి, సంగారెడ్డి: రాయికోడ్లో ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్పై దాడి జరిగింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపారు. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని చెకింగ్ ఇన్స్పెక్టర్ గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు కాకుండా ఉండేందుకు రూ. 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో చెకింగ్ ఇన్స్పెక్టర్పై ప్రయాణికులు, కండక్టర్ చెప్పులతో దాడి చేశారు.


