విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు  | No Shortage For Coal Power Plants Singareni: CMD N Sridhar | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు 

Oct 19 2021 3:34 AM | Updated on Oct 19 2021 3:34 AM

No Shortage For Coal Power Plants Singareni: CMD N Sridhar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతీరోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ స్పష్టం చేశారు. తమ గనుల నుంచి లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షా 90 వేల టన్నుల బొ గ్గు రవాణా చేస్తున్నామని, నవంబర్‌ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

కేంద్రబొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి సంస్థ డెరైక్టర్లు, ఏరియా జనరల్‌ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుపై సమీక్ష నిర్వహించారు.  ఎట్టి పరిస్థితుల్లో కూడ రాష్ట్రంలోని విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement