నిజామాబాద్‌: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట

Nizamabad EO Venu Swim Video Creates Controversy - Sakshi

సాక్షి, నిజామాబాద్: దక్షిణ కాశీగా పేరున్న నీలకంఠేశ్వరాలయంలో జరిగిన ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. ఒకవైపు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఈవో(ఎండోమెంట్ ఆఫీసర్) జలకాలాటకు దిగాడు. 

నాలుగు ఆలయాలకు ఇంఛార్జిగా పని చేస్తున్న ఈవో వేణు.. పుష్కరిణిలో ఈత కొట్టాడు. ఆ సమయంలో  వద్దని అర్చకులు వారిస్తున్నా.. ఆయన వినిపించుకోలేదు. అయితే అక్కడే ఉన్న కొందరు అదంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఆలయంలో అపచారం జరిగిందంటూ ఈవో వేణుపై మండిపడుతున్నారు పలువురు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top