మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ సమీక్షలు | Meenakshi and Bhatti Vikramarka and Mahesh Goud Visit To Khammam District: Telangana | Sakshi
Sakshi News home page

మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ సమీక్షలు

May 31 2025 5:05 AM | Updated on May 31 2025 5:05 AM

Meenakshi and Bhatti Vikramarka and Mahesh Goud Visit To Khammam District: Telangana

నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నేతలతో మీనాక్షి నటరాజన్‌ ముఖాముఖి... నేడు ఖమ్మం జిల్లాలో మీనాక్షి, డిప్యూటీ సీఎం భట్టి, మహేశ్‌గౌడ్‌ పర్యటన

సాక్షి హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగుతున్నాయి. మూడోరోజు శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితి, రాజకీయ సమీకరణలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

జనగామ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి ఓటమిపై మీనాక్షి ఆరా తీసినట్టు తెలిసింది. ‘మీరు ఎందుకు ఓడిపోయారు?’అని ప్రతాపరెడ్డిని మీనాక్షి ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ నేతలే ఇందుకు కారణమని ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్ష అనంతరం ఆదివాసీ విభాగం సమావేశంలో వారు పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బలరాం నాయక్, రఘురామ్‌ రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement