
42 ఠాణాలకు కొత్త ఇన్స్పెక్టర్ల నియామకం
టోలిచౌకీ తొలి ఎస్హెచ్ఓగా రమేష్ నాయక్
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్లో భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 144 మందికి స్థానచలనం కల్పించిన కొత్వాల్ సీవీ ఆనంద్..సస్పెన్షన్లో ఉన్న ముగ్గురికీ పోస్టింగ్స్ ఇచ్చారు. 42 శాంతిభద్రతల పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) మారగా...కొత్తగా ఏర్పడిన టోలిచౌకి ఠాణా తొలి ఎస్హెచ్ఓగా లావూరి రమేష్ నాయక్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం రెయిన్బజార్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, సీసీఎస్ విభాగాల్లోనూ కీలక మార్పులు జరిగాయి. ఇన్స్పెక్టర్ బదిలీల్లో ముఖ్యమైనవి ఇలా...