రేవంత్‌.. రైతులకు లీగల్‌ నోటీసులా?: కేటీఆర్‌ ఫైర్‌ | KTR Slams CM Revanth Reddy Congress Party Over Rythu Runa Mafi, Details Inside - Sakshi
Sakshi News home page

రేవంత్‌.. రైతులకు లీగల్‌ నోటీసులా?: కేటీఆర్‌ ఫైర్‌

Mar 24 2024 1:30 PM | Updated on Mar 24 2024 4:52 PM

ktr slams on revanth reddy congress Over Rythu Runa Mafi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. రైతుల పంట రుణాలపై కాంగ్రెస్‌ సర్కారు మౌనం వహిస్తూ.. రైతన్నలకు లీగల్‌ నోటీసులను పంపుతోందని ఫైర్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రైతులను పచ్చి దగా, నయవంచనతో మోసం చేస్తోందన్నారు.  

‘ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు.

నేడు.. పంట రుణాలపై కాంగ్రెస్‌ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్‌ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ సర్కార్‌ను ఎండగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement