సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలు కొత్త పథకాల జాడే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ తీసుకవచ్చిన కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుభీమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన ఈ రోజు (శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. దేశానికే అన్నం పెట్టిన తెలంగాణను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందన్నారు.


