లండన్‌లో హైదరాబాద్‌ వాసి దారుణ హత్య | Hyderabad Man Stabbed To Death In London - Sakshi
Sakshi News home page

కూతురి పెళ్లి కోసం వచ్చే క్రమంలో.. లండన్‌లో హైదరాబాద్‌ వాసి దారుణ హత్య

Oct 3 2023 11:55 AM | Updated on Oct 3 2023 9:05 PM

Hyderabad Man Assassinated In London - Sakshi

ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన హైదరాబాద్‌ వాసి కూతురి పెళ్లి కోసం తిరిగి వచ్చే క్రమంలో.. 

లండన్‌: విదేశంలో హైదరాబాద్‌ వాసి దారుణ హత్యకు గురయ్యారు. ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన మహమ్మద్‌ ఖాజా రయీస్ ఉద్దీన్‌ను(65) ఓ దుండగుడు హత్య చేశాడు. తన మిత్రుడుతో కలిసి వెళుతుండ ఉంగాడా దేశీయుడి చేతిలో కత్తిపోట్లకు గురై మరణించాడు. ఖాజాతోపాటు మరో అఫ్గాన్‌ వ్యక్తిని సైతం నిందితుడు పొడిచి చంపాడు. డబ్బుల కోసం గొడవపడిన దుండగుడు వీరిని కత్తితో పొడిచి హత్య చేసి పరారైనట్లు అనుమానిస్తున్నారు. 

కాగా మహమ్మద్‌ ఖాజా రయిస్‌ ఉద్దీన్‌ 2011లో ఉపాధి కోసం లండన్‌ వెళ్లాడు. అక్టోబర్‌ 5న హైదరాబాద్‌లో ఆయన కుమార్తె వివాహం ఉంది. కూతురు పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమైన సమయంలోనే ఈ విషాదం నెలకొంది. పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబ సభ్యులకు రైసుద్దీన్‌ మరణంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను ఖాజా కుటుంబం అభ్యర్థిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement