
హైదరబాద్: మాదాపూర్లోని మ్యాడ్ పబ్లో కొంతమంది అతిగా మద్యం తాగి, బిల్లు ఎక్కువగా వచ్చిందని పబ్ సిబ్బందితో గొడవ పడ్డారు. బిల్లు తగ్గించాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అక్కడున్న సిబ్బంది, బౌన్సర్లపై ఖాళీ సీసాలు, చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో బౌన్సర్లకు తీవ్ర గాయాలవగా..కొండాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పబ్ ఓనర్ ప్రశాంత్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బౌన్సర్లపై కస్టమర్ల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ - కొండాపూర్ లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్లు, బౌన్సర్ల మధ్య ఘర్షణ..
గొడవ ముదిరి దాడికి దిగిన కస్టమర్లు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
బిల్లు చెల్లించాలని మేనేజర్ కస్టమర్లను అడగడంతో మొదలైన గొడవ
దీంతో ఆగ్రహానికి… pic.twitter.com/5cOP3Iqtsg— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025