భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్‌ పందిరి | Sakshi
Sakshi News home page

భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్‌ పందిరి

Published Sun, Sep 3 2023 6:38 AM

Gwalior canopies on the Mada streets of Bhadradri  - Sakshi

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్‌ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చైర్మన్‌ జీబీఎస్‌ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్‌ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు.

దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్‌ సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement