సాక్షి, హైదరాబాద్: సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ బ్లాకులు రిసెప్షన్ లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరును ఓపీ నమోదు కౌంటర్, పోస్ట్ ఆపరేషన్ వార్డు, ట్రామా విభాగం, ఆపరేషన్ థియేటర్స్, ఇతర విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పాల్గొన్నారు. రూ.1,126 కోట్ల ఖర్చుతో వెయ్యికి పైగా పడకలతో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించారు.


