
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఉద్యోగులు దావత్ ఏర్పాటు చేసుకున్నారు. మీడియా అక్కడికి చేరుకోవడంతో కొంత మంది ఉద్యోగులు అక్కడి నుంచి జారుకోగా మరికొంత మంది అక్కడే ఉంటూ నానా హంగామా సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులే మందుతాగుతూ విందు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అటవీశాఖ అధికారి రవిప్రసాద్ను వివరణ కోరగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
dinner