విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి | A Farmer Died Due To Electric Shock In Telangana Mahabubabad, More Details Inside | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి

Jul 16 2024 3:08 PM | Updated on Jul 16 2024 3:38 PM

A Farmer Died Due To Electric Shock

కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.

రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్‌ వద్ద షాక్‌ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement