
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియోలు, AI ఫేక్ ఫోటోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్పోస్ట్లపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆ పోస్ట్లను పలువురు సెలబ్రిటీలు డిలీట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టీ వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఫేక్ పోస్ట్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా యూఆర్ఎల్తో సహా పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టులు తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రెటీలు పోస్ట్లు తొలగించినట్లు పోలీస్ శాఖ గుర్తించారు.