సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. ఉచిత ఆర్టీసీ బస్సులను ఇంకా పెంచుతామని వీహెచ్ తెలిపారు. దీంతో ఆయన మాట్లాడుతుండగా ఆటో కార్మికులు నిరసనకు దిగారు. ఆటో కార్మికులు ఏం చేస్తారంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ తీరుపై కార్మికులు మండిపడుతున్నారు.