రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌ భేటీ | Telangana CM Revanth Reddy Met With Union Defence Minister Rajnath Singh In New Delhi | Sakshi
Sakshi News home page

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌ భేటీ

Jun 24 2024 5:21 PM | Updated on Jun 24 2024 5:58 PM

Cm Revanth Reddy Met With Defence Minister Rajnath Singh

సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై  వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సోమవారం(జూన్‌24) సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. 

సికింద్రాబాద్‌లో ఫ్లైఓవర్‌ల నిర్మాణాలకు కంటోన్మెంట్ భూముల అప్పగింత, సైనిక్ స్కూల్ తదితర అంశాలపై చర్చ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో రేవంత్‌ చర్చించారు. 

ఈ సమావేశంలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి,రఘురామరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ ఎంపీ అనిల్ కమార్ యాదవ్ మాజీమంత్రి కడియం శ్రీహరి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement