8 లక్షలు పెట్టి ఆడీ కారు.. పార్కు చేసిన చోటే మాయం  | Audi Car Missing From Parking In Hyderabad | Sakshi
Sakshi News home page

8 లక్షలు పెట్టి ఆడీ కారు.. పార్కు చేసిన చోటే మాయం 

Jun 15 2021 8:52 AM | Updated on Jun 15 2021 8:58 AM

Audi Car Missing From Parking In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిలకలగూడ : పార్కింగ్‌ చేసిన ఆడీ కారు మాయమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రోమిత్‌పటేల్‌ తన స్వస్థలమైన గుజరాత్‌లో ఆడీ కారును సెకండ్స్‌లో రూ.8 లక్షలకు కొనుగోలు చేసి రెండు రోజుల క్రితం నగరానికి తీసుకువచ్చాడు.

సోమవారం ఉదయం అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో పార్కు చేశాడు. మ.1.30 గంట సమయంలో చూడగా కారు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఐ సంజయ్‌కుమార్‌ తెలిపారు. 

చదవండి: నిన్న రోడ్డెక్కిన తండ్రి.. నేడు చెట్టెక్కిన కొడుకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement