యువకుడి బ్యాంక్‌ ఖాతాలో 753 కోట్లు | - | Sakshi
Sakshi News home page

యువకుడి బ్యాంక్‌ ఖాతాలో 753 కోట్లు

Oct 8 2023 1:44 AM | Updated on Oct 8 2023 10:50 AM

- - Sakshi

కొటాక్‌ మహేంద్ర బ్యాంక్‌ నుంచి రూ.756 కోట్లు తంజావూరులోని ఓ యువకుడి ఖాతాలోకి వచ్చి చేరింది.

సాక్షి, చైన్నె: ఇటీవల కాలంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది చేస్తున్న పొరబాట్లు, నిర్లక్ష్యం కారణంగా మరొకరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ కావడంతో, ఆ తర్వాత అవి వెనక్కి వెళ్లడం తమిళనాట పరిపాటిగా మారింది. గత నెల కాల్‌ ట్యాక్సీ డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ ఖాతాలో ఏకంగా 9 వేల కోట్లను తమిళనాడు మార్కంటైల్‌ బ్యాంక్‌ నుంచి జమ అయ్యింది. ఇది మరవక ముందే కొటాక్‌ మహేంద్ర బ్యాంక్‌ నుంచి రూ.756 కోట్లు తంజావూరులోని ఓ యువకుడి ఖాతాలోకి వచ్చి చేరింది.

ఖాతాదారుల ప్రేమయం లేకుండానే వెనక్కి ఆ మొత్తాలను బ్యాంక్‌ వర్గాలు తీసుకునేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం చైన్నె తేనాంపేటలోని ఓ మెడికల్‌ షాపులో పని చేస్తున్న మహ్మద్‌ ఇక్రీష్‌ అనే యువకుడి ఖాతాలోకి రూ. 753 కోట్ల 44 లక్షలు జమ అయ్యాయి. ఇది చూసిన ఆ యువకుడి బ్యాంకర్లకు సమాచారం ఇవ్వగా, ఏకంగా అతడి ఖాతాను సీజ్‌ చేసి పడేయడంతో వ్యవహారం మీడియాకు చేరింది.

సరైన సమాధానం ఇవ్వకుండా..
మహ్మద్‌ ఇక్రీష్‌ శుక్రవారం తన ఖాతా నుంచి ఓ మిత్రుడికి రూ. 2 వేలు, మరో మిత్రుడికి రూ. 100 నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత అతడి బ్యాంక్‌ ఖాతాలోకి పెద్దఎత్తున నగదు జమ అయినట్లుగా ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. దీనిని పెద్దగా అతడు పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం తన ఖాతాను చెక్‌ చేసుకున్నారు. తన ఖాతాలో రూ. 753 కోట్ల 44 లక్షలు బ్యాలెన్స్‌ ఉండడంతో షాక్‌కు గురయ్యాడు.

ఈ విషయంగా సంబంధిత బ్యాంక్‌ సేవా కేంద్రాన్ని సంప్రదించినా పట్టించుకోలేదు. చివరకు బ్యాంక్‌ నెంబర్‌ ఆధారంగా మేనేజర్‌ను సంప్రదించాడు. ఈ సమాచారంతో ఆ బ్యాంక్‌ వర్గాలు ఆగమేఘాలపై అతడి ఖాతాను సీజ్‌ చేయడం గమనార్హం. తనకు పెద్దఎత్తున సొమ్ము వచ్చినట్టు సమాచారం ఇస్తే, చివరకు తన ఖాతాను సీజ్‌ చేశారని, తనకు సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ ఆ యువకుడు మీడియా దృష్టికి తీసుకు రావడంతో తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement