పెనుకొండ: అవిసె.. సాగు చేయడంతో అధిక ఆదాయం లభిస్తుంది. నియోజకవర్గంలోని గొర్రెలు, మేకల కాపరులు గొర్రెలు, పొట్టేళ్లకు అవిసె మొక్కలు మేతగా విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.పొట్టేళ్లు, గొర్రెలను బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్, ఇతర పట్టణ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవిసె ఆకును కాపరులు పెంచుతూ జీవాలకు మేతగా విక్రయించడం ద్వారా రూ.లక్షలు పొందుతున్నారు. గొర్రెలు, పొట్టేళ్లకు ఆవిశ ఆకు ఎంతో ఇష్టమైన మేత. రైతులు తక్కువ నీటితో ఈ అవిసె ఆకును సాగు చేస్తూ రోజూ ఈ జీవాలకు ఆహారంగా అందిస్తున్నారు. ఇటీవల అనేక మంది షెడ్ల నిర్మాణం చేపట్టి అందులో గొర్రెలు పొట్టేళ్లను మేపుతూ వాటికి ఫీడ్తో పాటు అవిసె ఆకును అందిస్తూ తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్నారు.


