న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్లో రన్నరప్గా నిలిచింది. మహిళల డబుల్స్లో భారత్కే చెందిన సిండ్రెల్లా దాస్తో కలిసి టైటిల్ సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 6–11, 1–11, 11–8, 7–11, 11–13తో భారత్కే చెందిన యశస్విని చేతిలో ఓడింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–సిండ్రెల్లా 11–8, 11–13, 11–8, 11–6తో యశస్విని–దివ్యాంశిలపై గెలిచారు.


