ఆనవాయితీకి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ ప్రారంభమైంది. గతేడాది బెంగళూరు జట్టు తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న అనంతరం విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతిచెందారు. దీంతో వారిని స్మరిస్తూ... మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ప్లేయర్లు, మ్యాచ్ సిబ్బందితో పాటు ప్రేక్షకులు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే వారి జ్ఞాపకార్ధం పీ1 స్టాండ్లోని 11 సీట్లను ఖాళీగా పెట్టారు.


