రెండో సారి 'ఆ ఘనత' సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌.. గిల్‌, బుమ్రా మాత్రమే..! | SHREYAS IYER WON ICC PLAYER OF THE MONTH AWARD FOR MARCH 2025 | Sakshi
Sakshi News home page

రెండో సారి 'ఆ ఘనత' సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌.. గిల్‌, బుమ్రా మాత్రమే..!

Published Tue, Apr 15 2025 12:32 PM | Last Updated on Tue, Apr 15 2025 2:34 PM

SHREYAS IYER WON ICC PLAYER OF THE MONTH AWARD FOR MARCH 2025

టీమిండియా స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 2025 మార్చి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం శ్రేయస్‌.. న్యూజిలాండ్‌కు చెందిన రచిన్‌ రవీంద్ర, జేకబ్‌ డఫీతో పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు తమ ఓట్ల ద్వారా శ్రేయస్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా (మార్చి) నిర్ణయించారు.

శ్రేయస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకోవడం​ ఇది రెండో సారి (2022 ఫిబ్రవరి, 2025 మార్చి). భారత క్రికెటర్లలో శుభ్‌మన్‌ గిల్‌, జస్ప్రీత్‌ బుమ్రా (2024 జూన్‌, 2024 డిసెంబర్‌) మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్‌ తరఫున గిల్‌ అత్యధికంగా మూడు సార్లు (2023 జనవరి, 2023 సెప్టెంబర్‌, 2025 ఫిబ్రవరి) ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా నిలిచాడు.

2021 జనవరిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అమల్లోకి వచ్చిన తొలి మూడు నెలల్లో భారత ఆటగాళ్లే (పంత్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌) ఈ అవార్డు గెలవడం విశేషం.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డులు గెలుచుకున్న టీమిండియా క్రికెటర్లు..
శుభ్‌మన్‌ గిల్‌-3
జస్ప్రీత్‌బుమ్రా-2
శ్రేయస్‌ అయ్యర్‌-2
రిషబ్‌ పంత్‌-1 (2021 జనవరి)
రవిచంద్రన్‌ అశ్విన్‌-1 (2021 ఫిబ్రవరి)
భువనేశ్వర్‌ కుమార్‌-1 (2021 మార్చి)
విరాట్‌ కోహ్లి-1 (2022 అక్టోబర్‌)
యశస్వి జైస్వాల్‌-1 (2024 ఫిబ్రవరి)

మార్చి నెలలో శ్రేయస్‌ అయ్యర్‌
శ్రేయస్‌ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్‌ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్‌ భారత్‌ తరఫున లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడంలో శ్రేయస్‌ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో 79 పరుగులు చేసిన శ్రేయస్‌.. సెమీస్‌లో ఆసీస్‌పై 45, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్‌ మిడిలార్డర్‌లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

మహిళల విభాగంలో వాల్‌
మహిళల విభాగంలో మార్చి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌  అవార్డు కోసం చేతన ప్రసాద్‌ (యూఎస్‌ఏ), జార్జియా వాల్‌ (ఆస్ట్రేలియా), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (ఆస్ట్రేలియా) పోటీ పడగా.. జార్జియా వాల్‌ విజేతగా నిలిచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement