వైభవ్‌ ఆడడంపై శ్రేయ‌స్ కీల‌క వ్యాఖ్య‌లు | Shreyas Iyer Says-Possible-Changes-Made-In-Team-3rd T20 Vs AFG | Sakshi
Sakshi News home page

వైభవ్‌ ఆడడంపై శ్రేయ‌స్ కీల‌క వ్యాఖ్య‌లు

Sep 16 2026 4:41 AM | Updated on Sep 16 2026 4:56 AM

Shreyas Iyer Says-Possible-Changes-Made-In-Team-3rd T20 Vs AFG

Photo Credit: BCCI Twitter

ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంస‌న్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, అభిషేక్ శ‌ర్మ (39), ఇషాన్ కిష‌న్ (34 నాటౌట్‌) రాణించారు.  

చివ‌ర్లో తిల‌క్ వ‌ర్మ (15 నాటౌట్‌) జ‌ట్టును గెలిపించాడు. ర‌షీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మాట్లాడాడు. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు సంజూ శాంస‌న్ నోటితోనే స‌మాధానం చెప్పాడ‌ని పేర్కొన్నాడు. బౌల‌ర్ల స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న ఈ విజ‌యాన్ని అందించింద‌ని తెలిపాడు.

తొలి మ్యాచ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని ఆశించామని.. దానికి తగ్గట్టుగానే భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించార‌ని తెలిపాడు. మైదానంలో ప్లేయర్లు చూపిన పట్టుదల, ప్లాన్ అమలు తీరు తమకు అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. 

మొదట్లో కొన్ని విషయాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, క్రీడా ప్ర‌యాణం అనేది ఒక‌ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని పేర్కొన్నాడు. ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ఉండటం చాలా ముఖ్యమని, గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఒత్తిడిని ఎంతగా ఆస్వాదిస్తే పరిస్థితులు అంతగా అనుకూలంగా మారుతాయని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.

ఇక సిరీస్ ఇప్పటికే 2-0తో కైవసం కావడంతో చివరి, మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన వైభవ్‌ సూర్యవంశీ మూడో టీ20లో ఆడే అవకాశముంది. అందరినీ ఇక్కడి పిచ్ వాతావరణానికి అలవాటు చేయడం, మైదానంలో తగినంత ప్రాక్టీస్ కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు మూడో మ్యాచ్ లో అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని.. జ‌ట్టు కాంబినేషన్‌లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: శ‌తకంతో చెల‌రేగిన బ్రూక్‌.. లంక‌పై ఇంగ్లండ్ విజ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement