రన్నరప్‌ అంకిత–రుతుజా జోడీ   | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ అంకిత–రుతుజా జోడీ  

Published Sun, Mar 31 2024 3:13 AM

Runnerup Ankita and Rutuja Jodi - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య డబ్ల్యూ50 టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్‌) జోడీ రన్నరప్‌గా నిలిచింది. జపాన్‌లో శనివారం జరిగిన ఫైనల్లో అంకిత–రుతుజా ద్వయం 3–6, 5–7తో ఇరీనా హయాషి–సాకి ఇమామురా (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత, రుతుజా తమ సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement