-
రన్నరప్ అంకిత–రుతుజా జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ50 టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్) జోడీ రన్నరప్గా నిలిచింది. జపాన్లో శనివారం జరిగిన ఫైనల్లో అంకిత–రుతుజా ద్వయం 3–6, 5–7తో ఇరీనా హయాషి–సాకి ఇమామురా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అంకిత, రుతుజా తమ సర్విస్ను నాలుగుసార్లు కోల్పోయింది. -
అంకిత రైనా జోడీకి టైటిల్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్ – డబ్ల్యూ35) మహిళల ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా తన భాగస్వామితో కలిసి విజేతగా నిలిచింది. కజకిస్తాన్కు చెందిన జిబెక్ కులంబయెవాతో కలిసి అంకిత డబుల్స్ బరిలోకి దిగింది. శనివారం జరిగిన ఫైనల్లో అంకిత – జిబెక్ ద్వయం 6–4, 6–2 స్కోరుతో జాక్లిన్ కబాజ్ (స్వీడన్) – జస్టినా మికుల్సైట్ (లిథుయేనియా)పై విజయం సాధించింది. అయితే సింగిల్స్ విభాగంలో అంకితకు సెమీ ఫైనల్లోనే చుక్కెదురైంది. సెమీస్లో కొరియాకు చెందిన యెన్ వూ కూ 7–6 (7/4), 6–3 తేడాతో అంకితను ఓడించింది. మరో సెమీస్లో దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)ను 6–4, 2–6, 7–6 (7/0)తో ఓడించి ఫైనల్కు అర్హత సాధించిన జస్టినా మికుల్సైట్ (లిథుయేనియా) తుది పోరులో యెన్ వూ కూతో తలపడేందుకు సిద్ధమైంది. -
అంకిత రైనా శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ లో భారత స్టార్ అంకిత రైనా శుభారంభం చేసింది. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 221వ ర్యాంకర్ అంకిత 6–4, 5–7, 7–6 (10/7)తో ప్రపంచ 158వ ర్యాంకర్ జెస్సికా బుజస్ మనెరో (స్పెయిన్)పై గెలిచింది. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇద్దరూ తమ సర్విస్లను ఎనిమిదిసార్లు కోల్పోయారు. నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్లో అంకిత పైచేయి సాధించి విజేతగా నిలిచింది. రెండో రౌండ్లో ప్రపంచ 132వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్)తో అంకిత తలపడుతుంది. -
అంకిత రైనా పరాజయం
జపాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఒసాకాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 181వ ర్యాంకర్ అంకిత 4–6, 2–6తో ప్రపంచ 174వ ర్యాంకర్ మొయుక ఉచిజుమా (జపాన్) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అంకిత తన సరీ్వస్ను మూడుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన అంకితకు 2,804 డాలర్ల (రూ. 2 లక్షల 32 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
అంకిత పరాజయం
న్యూయార్క్: భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా ఈ ఏడాది చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ మ్యాచ్లలో తొలి రెండు నెగ్గిన అంకిత మూడో క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో అంకిత వరుస సెట్లలో 2–6, 2–6 స్కోరుతో మిర్జమ్ జొర్క్లండ్ (స్వీడన్) చేతిలో పరాజయంపాలైంది. 1 గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 154వ ర్యాంకర్ అంకిత తన ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. జొర్క్లండ్ 3 ఏస్లు సంధించగా, అంకిత ఒకే ఒక ఏస్ కొట్టింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement