IPL 2022: రోహిత్‌ శర్మకు భారీ మూల్యం తప్పదు..!   

Rohit Sharma May Face One Match Ban For Slow Over Rate - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రావట్లేదు. ఈ సీజన్‌లో రోహిత్‌ సేన ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత ధీన స్థితిని ఎదుర్కొంటుంది. ఇది చాలదన్నట్లుగా ఆ జట్టును మరో సమస్య భయపెడుతుంది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇప్పటికే 2 మ్యాచ్‌ల్లో ఫైన్లతో గట్టెక్కిన ఆ జట్టు సారధి.. సేమ్‌ సీన్‌ మరో మ్యాచ్‌లో రిపీట్‌ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియ‌న్స్ మరో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేస్తే, జట్టుగా సారధి రోహిత్‌ శర్మపై ఓ మ్యాచ్ నిషేధం తప్పనిసరి అవుతుంది. 

కాగా, నిర్ణీత స‌మ‌యంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయ‌లేని కార‌ణంగా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు 24 లక్షల జ‌రిమానా విధించారు. అత‌నితో పాటు జ‌ట్టు సభ్యులందరికీ తలో 6 ల‌క్ష‌ల ఫైన్‌ వేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌కు 12 ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది. ఒక‌వేళ ఇదే సీన్‌ మూడోసారి రిపీటైతే ఐపీఎల్‌ సవరించిన రూల్స్‌ ప్రకారం 30 ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించే అవ‌కాశం ఉంది. 
చదవండి: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. సీజన్‌లో తొలి కేసు నమోదు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top