IPL 2022: Delhi Capitals Physio Patrick Farhart Tests Positive for Covid-19 - Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. సీజన్‌లో తొలి కేసు నమోదు..!

Apr 15 2022 6:08 PM | Updated on Apr 15 2022 6:52 PM

IPL 2022: Delhi Capitals Physio Patrick Farhart Tests Positive for Covid - Sakshi

ఐపీఎల్‌లో కరోనా కలకలం రేగింది. ప్రస్తుత సీజన్‌లో తొలి కరోనా కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాట్రిక్‌ను ఐసోలేషన్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 


ప్యాట్రిక్‌ గత రెండు రోజులుగా ఢిల్లీ జట్టు సభ్యులతో కలియతిరగడంతో ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్యాట్రిక్‌కు కరోనా నిర్ధారణ అయిన విషయంపై డీసీ ఫ్రాంచైజీ వర్గాలు స్పందించాల్సి ఉంది. ప్యాట్రిక్‌ కరోనా బారిన పడినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రేపు (ఏప్రిల్‌ 16) ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్యాట్రిక్‌ గతంలో టీమిండియా ఫిజియోగా కూడా పనిచేశాడు.  
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రంగంలోకి దిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement