రిషబ్‌ పంత్‌ సరికొత్త చరిత్ర.. 141 ఏళ్ల టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే | Rishabh Pant Creates History, Becomes First Indian Wicketkeeper To Achieve Rare Feat | Sakshi
Sakshi News home page

IND vs ENG: రిషబ్‌ పంత్‌ సరికొత్త చరిత్ర.. 141 ఏళ్ల టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే

Jun 24 2025 1:14 PM | Updated on Jun 24 2025 1:38 PM

Rishabh Pant Creates History, Becomes First Indian Wicketkeeper To Achieve Rare Feat

లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలోనూ పంత్‌ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.

తన అద్బుత సెంచరీలతో ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో పంత్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

పంత్‌ సాధించిన రికార్డులు ఇవే..
ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా పంత్‌ చరిత్ర సృష్టించాడు. లీడ్స్‌ టెస్టులో పంత్‌ 252 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బుద్ధి కుందరన్‌ పేరిట ఉండేది. కుందరన్‌ 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 61 ఏళ్ల కుందరన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును పంత్‌ బ్రేక్‌ చేశాడు.

ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్లు వీరే..
👉రిషబ్ పంత్ 252
👉బుద్ధి కుందరన్ 230
👉ఎంఎస్ ధోని 224
👉రిషబ్ పంత్ 203
👉ఫరోఖ్ ఇంజనీర్ 187

👉అదేవిధంగా 141 టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే ఒకే మ్యాచ్‌లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ అగ్రస్ధానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులతో ఫ్లవర్‌ ఆజేయంగా నిలిచాడు.

👉ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన ఏకైక ఆసియాన్‌ వికెట్‌ కీపర్‌ కూడా పంత్‌ కావడం విశేషం.

👉ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా క్రికెట్‌ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డును రిషబ్‌ సమం చేశాడు. వారిద్దరూ ఇంగ్లండ్‌లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించారు. పంత్‌కు కూడా ఇంగ్లండ్‌ గడ్డపై నాలుగో టెస్టు సెంచరీ. ఈ రేర్‌ ఫీట్‌సాధించిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ 6 సెంచరీలతో రాహుల్‌ ద్రవిడ్‌ అగ్రస్ధానంలో ఉన్నాడు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement