దేశమే సర్వస్వం.. దేనికి వెనకాడం.. పంత్‌ భావోద్వేగ పోస్ట్‌ | "Country Means Everything...": Rishabh Pant Wins Hearts With Emotional Post After Oval Test Victory, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

దేశమే సర్వస్వం.. దేనికి వెనకాడం.. ఓవల్‌ టెస్ట్‌ విజయానంతరం పంత్‌ భావోద్వేగ పోస్ట్‌

Aug 5 2025 8:31 AM | Updated on Aug 5 2025 9:47 AM

Country Means Everything: Pant Wins Hearts With Emotional Post After Oval Test Glory

క్రికెట్చరిత్రలో అత్యుత్తమ టెస్ట్మ్యాచ్లలో ఇది ఒకటి. ఓవల్వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఇంగ్లండ్పై భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. మ్యాచ్క్రికెట్ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆట చివరి రోజు భారత బౌలర్లు ధీరత్వాన్ని ప్రదర్శించి 35 పరుగుల స్వల్ప లక్ష్నాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇంగ్లండ్చేతిలో 4 వికెట్లుండగా.. సిరాజ్‌ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ప్రసిద్ద్కృష్ణ తన వంతుగా వికెట్తీశాడు.

374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దశలో పటిష్టమైన స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. ఈ గెలుపులో సిరాజ్‌ది ప్రధానపాత్ర. ఈ హైదరాబాదీ పేసర్‌ అసలుసిసలైన పోరాట యోధుడిలా పోరాడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సహా, మ్యాచ్మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్ఆఫ్ మ్యాచ్గా నిలిచాడు.

కాగా, ఈ గెలుపు అనంతరం గాయపడిన టీమిండియా హీరో రిషబ్పంత్స్పందించాడు. ఇన్స్టా వేదికగా భావోద్వేగమైన పోస్ట్పెట్టాడు. సిరీస్లో నాలుగో టెస్ట్సందర్భంగా గాయపడి, ఐదో టెస్ట్కు దూరంగా ఉన్న పంత్‌.. టీమిండియా సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. సహచరులను కొనియాడాడు. తన జట్టు పట్ల గర్వంగా ఉన్నానని అన్నాడు. దేశమే సర్వస్వమని తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేప్పుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని అన్నాడు. దేనికి వెనుకాడేది లేదనిస్పష్టం చేశాడు.

పంత్మాటల్లో.. ఇంగ్లండ్పర్యటన మా నుంచి చాలా అడిగింది. అంతకుమించి తిరిగి ఇచ్చింది. జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికి తీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము.

మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్ఆధ్యాంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది. ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్తర్వాత భారత క్రికెట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.

కాగా, సిరీస్లో రిషబ్పంత్టీమిండియాకు వైస్కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సిరీస్లో అతను అరివీర భయంకరమైన ఫామ్లో ఉండగా గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు

నాలుగో టెస్ట్లో క్రిస్వోక్స్బౌలింగ్లో రివర్స్స్వీప్చేయబోగా పంత్పాదంఫ్రాక్చర్కు గురైంది. పాదం ఫ్రాక్చర్అయినా పంత్ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి దేశానికి ఆడటమంటే తనకేంటో ప్రపంచం మొత్తానికి నిరూపించాడు. ఇన్నింగ్స్లో పంత్కుంటుతూనే హాఫ్సెంచరీ చేయడం విశేషం. ఓవల్టెస్ట్లో విజయంతో భారత్ఐదు మ్యాచ్ టెస్ట్సిరీస్ను 2-2తో సమం చేసుకుంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement