మనీశ్‌ పాండే విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే..! | Manish Pandey Slams 58 Runs From Just 29 Balls Including 4 Fours And 4 Sixes In His First Match In Maharaja Trophy 2025 | Sakshi
Sakshi News home page

మనీశ్‌ పాండే విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే..!

Aug 12 2025 8:46 AM | Updated on Aug 12 2025 9:55 AM

Manish Pandey Slams 58 Runs From Just 29 Balls Including 4 Fours And 4 Sixes In His First Match In Maharaja Trophy 2025

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో మైసూర్‌ వారియర్స్‌ కెప్టెన్‌ మనీశ్‌ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిన్న (ఆగస్ట్‌ 11) బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మైసూర్‌ ఇన్నింగ్స్‌లో మనీశ్‌తో పాటు సుమిత్‌ కుమార్‌ (28 బంతుల్లో 44 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), హర్షిల్‌ ధర్మాణి (31 బంతుల్లో 38; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. బెంగళూరు బ్లాస్టర్స్‌ బౌలర్లలో శుభాంగ్‌ హేగ్డే 3 వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం బరిలోకి దిగిన బ్లాస్టర్స్‌.. ఎల్‌ఆర్‌ కుమార్‌ (4-0-27-3), అజిత్‌ కార్తీక్‌ (3.2-0-21-3), కృష్ణప్ప గౌతమ్‌ (4-0-28-2) ధాటికి 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (66) బ్లాస్టర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.

కాగా, మహారాజా ట్రోఫీ అనేది కర్ణాకటలో జరిగే స్థానిక టీ20 టోర్నీ. ఈ టోర్నీ యొక్క నాలుగో ఎడిషన్‌ నిన్ననే మొదలైంది. వాస్తవానికి ఈ టోర్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే మహిళల వరల్డ్‌కప్‌ ఏర్పాట్లలో భాగంగా వేదికను మైసూర్‌లోని వడియార్‌ క్రికెట్‌ స్టేడియంకు మార్చారు. 

ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. మనీశ్‌ పాండే నేతృత్వంలోని మైసూర్‌ వారియర్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో మనీశ్‌ పాండే, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, దేవ్‌దత్‌ పడిక్కల్‌, అభినవ్‌ మనోహర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement