RCBvPBKS: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు | IPL 2025 RCB Vs PBKS: Krunal Pandya Creates History, Becomes First Player In The IPL To Achieve This Rare Record | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు

Jun 4 2025 10:51 AM | Updated on Jun 4 2025 12:02 PM

Krunal Pandya Creates History, Becomes First Player In The IPL

PC: BCCI/IPL.com

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) చ‌రిత్ర‌లో సరికొత్త ఛాంపియ‌న్ అవ‌త‌రించింది. ఐపీఎల్‌-2025 సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. త‌మ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది.

ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(43) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. పాటిదార్‌(26), జితేష్ శ‌ర్మ‌(24), లివింగ్ స్టోన్‌(25) రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్‌, జామీస‌న్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు.

తిప్పేసిన కృనాల్‌..
అనంతరం లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగల్గింది. శశాంక్ సింగ్‌(61) ఆఖరి వరకు పోరాడినప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. పాండ్యా ఆసాధరణ ప్రదర్శనకు గాను ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌​ అవార్డు దక్కింది.

తద్వారా కృనాల్‌​ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్‌ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
చదవండి: Virat Kohli On RCB Win: ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement