RCB-IPL 2022: ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అనవసరమైన చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో అత్యధిక ఎక్స్ట్రాలు ఇచ్చిన జట్టుగా ఆర్సీబీ తొలి స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మొత్తంగా 39 పరుగులు ఎక్స్ట్రా రూపంలో ఇచ్చింది. అంతకముందు డెక్కన్ చార్జర్స్ 2008లో కోల్కతా నైట్రైడర్స్పై మ్యాచ్లో 38 పరుగులు అదనంగా సమర్పించుకొని తర్వాతి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 2010లో ముంబై ఇండియన్స్కు 38 పరుగులు అదనంగా ఇచ్చుకుంది.
చదవండి: IPL 2022: కెప్టెన్గా దంచికొట్టాడు.. అరుదైన ఫీట్ సాధించాడు
సంబంధిత వార్తలు