యూఏఈలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌..! | Women's T20 Asia Cup 2026: UAE Likely Host; India-Pakistan Clash Expected | Sakshi
Sakshi News home page

యూఏఈలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌..!

Aug 4 2026 2:32 PM | Updated on Aug 4 2026 2:36 PM

India vs Pakistan In UAE, Womens Asia Cup 2026 Dates and Venue Revealed

source: X

మహిళల క్రికెట్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఆసియా కప్‌ 2026 టోర్నీకి సంబంధించిన తేదీలను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) సభ్య దేశాలకు అంతర్గతంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరిగే అవకాశం ఉంది.

ఈసారి టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే వేదికలు, పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను ACC ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

భారత్‌-పాక్‌ పోరు
టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, యూఏఈ జట్లు పాల్గొనే అవకాశం ఉంది.

దీంతో క్రికెట్‌ అభిమానులకు మరోసారి భారత్‌-పాకిస్థాన్‌ మహిళల మ్యాచ్‌ చూసే అవకాశం లభించనుంది. అయితే ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయనే విషయం పూర్తి షెడ్యూల్‌ విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.

సభ్య దేశాలకు పంపిన సమాచార ప్రకారం, జట్లు ఆగస్టు 27న యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ నిర్వహించేలా విండోను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్‌ ఎందుకు ఆలస్యం..?
టోర్నీ తేదీలను సభ్య దేశాలకు తెలియజేసినా, ACC నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. టోర్నీ వేదికకు సంబంధించిన తుది నిర్ణయం, పరిపాలనా అనుమతులు పూర్తికాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇదే కారణంగా భారత మహిళల ఆసియా కప్‌ జట్టు ప్రకటనను కూడా BCCI తొలుత ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

భారత్‌దే ఆధిపత్యం
2004లో ప్రారంభమైన మహిళల ఆసియా కప్‌ తొలుత వన్డే ఫార్మాట్‌లో జరిగింది. 2012 నుంచి టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతోంది.

భారత్‌ ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు టైటిళ్లు గెలిచింది. అయితే 2024లో జరిగిన చివరి ఎడిషన్‌లో శ్రీలంక ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్‌ సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement