
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. షమీని హత్య చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ వెల్లడించాడు. అంతేకాకుండా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు హసీబ్ తెలిపాడు. ఈ ఘటనపై షమీ సోదరుడు ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతున్నారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో రాజ్పుత్ సిందార్ అనే వ్యక్తి ఈ బెదిరింపు ఇమెయిల్ పంపినట్లు గుర్తించారు. కాగా ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా ఇటువంటి బెదిరింపులే వచ్చాయి.
ఈ మెరకు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశాడు. కాగా మహ్మద్ షమీ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గాయం నుంచి కోలుకుని ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పర్వాలేదన్పించిన షమీ.. ఐపీఎల్లో మాత్రం తేలిపోతున్నాడు. షమీ ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 56.17 సగటుతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో షమీ భారత తరపున ఆడనున్నాడు.