గిల్‌ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్‌!.. ఆఖరికి మేమే గెలిచాం! | Gill Rahul Angry As Ball Change Row With Umpire Haunts India Jadeja Did This | Sakshi
Sakshi News home page

గిల్‌ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్‌!.. ఆఖరికి మేమే గెలిచాం!

Jun 24 2025 6:35 PM | Updated on Jun 24 2025 7:38 PM

Gill Rahul Angry As Ball Change Row With Umpire Haunts India Jadeja Did This

PC: Starsports/Sonynetwork X

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్‌లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్‌ (Leeds)లో భారత్‌ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.

లంచ్‌ బ్రేక్‌కు వెళ్లేసరికి ఇలా..
దీంతో.. ఓవర్‌ నైట్‌ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్‌ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్‌ బ్రేక్‌కు వెళ్లేసరికి జాక్‌ క్రాలే 42, బెన్‌ డకెట్‌ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.

శుబ్‌మన్‌ గిల్‌  అసంతృప్తి
ఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్‌ను అవుట్‌ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫానీ, పాల్‌ రీఫిల్‌లకు భారత ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, సిరాజ్‌ తదితరులు విజ్ఞప్తి చేశారు.

కెప్టెన్‌ గిల్‌ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్‌ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.

జడ్డూ చర్య వైరల్‌
ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంపైర్‌ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. 

ఇందుకు బదులుగా అంపైర్‌ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్‌ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ భారత్‌ తొలి టెస్టు
🏏షెడ్యూల్‌: జూన్‌ 20- 24
🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌
🏏టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బౌలింగ్‌

🏏భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471 ఆలౌట్‌
🏏ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465 ఆలౌట్‌
🏏భారత్‌కు ఆరు పరుగుల ఆధిక్యం

🏏భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 364 ఆలౌట్‌
🏏ఇంగ్లండ్‌ లక్ష్యం: 371
🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 21/0 (6) 
🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు: 117/0.

చదవండి: వసీం అక్రం, షేన్‌ వార్న్‌ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement