జట్టు మారిన జడేజా | Dharmendrasinh Jadeja leave Saurashtra, Shashank Singh heads to Puducherry | Sakshi
Sakshi News home page

జట్టు మారిన జడేజా

Aug 6 2026 2:34 PM | Updated on Aug 6 2026 2:39 PM

Dharmendrasinh Jadeja leave Saurashtra, Shashank Singh heads to Puducherry

source: X

సౌరాష్ట్ర క్రికెట్‌లో గత 13 ఏళ్లుగా కీలక ఆటగాడిగా ఉన్న ఎడమచేతి స్పిన్నర్‌ ధర్మేంద్రసిన్హ్‌ జడేజా ఆ జట్టును వీడనున్నాడు. రవీంద్ర జడేజాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అతడిలాగే ఎడమచేతి స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన 36 ఏళ్ల ధర్మేంద్రసిన్హ్‌.. సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి NOC పొందాడు. రాబోయే దేశవాళీ సీజన్‌లో ఛత్తీస్‌గఢ్‌ తరఫున ఆడనున్నాడు.

ధర్మేంద్రసిన్హ్‌ జడేజా ఇప్పటివరకు 100 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 423 వికెట్లు పడగొట్టాడు. 90 లిస్ట్‌-A మ్యాచ్‌లు, 73 టీ20లు కూడా ఆడాడు. 2019-20, 2022-23 సీజన్లలో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్లలో అతడు సభ్యుడిగా ఉన్నాడు.

2017-18 సీజన్‌ నుంచి దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (293) తీసిన బౌలర్‌గా జడేజా రికార్డు కలిగి ఉన్నాడు.  జడేజాకు వైట్‌బాల్‌ క్రికెట్‌లో తన పాత్రపై సౌరాష్ట్ర జట్టు మేనేజ్‌మెంట్‌తో అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. జడేజా రెడ్‌బాల్‌తో పాటు వైట్‌బాల్‌ ఫార్మాట్‌లోనూ కొనసాగాలని కోరుకోగా, సౌరాష్ట్ర మేనేజ్‌మెంట్‌ అతడిని ప్రధానంగా రెడ్‌బాల్‌ క్రికెట్‌కు పరిమితం చేయాలని భావించింది.

శశాంక్‌ సింగ్‌ పుదుచ్చేరికి
ఇదిలా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కీలక ఆటగాడు శశాంక్‌ సింగ్‌ పుదుచ్చేరికి మారాడు. రాబోయే దేశవాళీ సీజన్‌లో అతడు పుదుచ్చేరి తరఫున ఆడనున్నాడు.

ఇక విదర్భకు చెందిన లలిత్‌ యాదవ్, బరోడాకు చెందిన నినాద్‌ రాథ్వా ఒడిశా జట్టులో ప్రొఫెషనల్‌ ఆటగాళ్లుగా చేరారు. ఇద్దరూ తమ తమ రాష్ట్ర క్రికెట్‌ సంఘాల నుంచి NOCలు పొందారు.

మరోవైపు గత సీజన్‌లో మహారాష్ట్ర తరఫున ఆడిన రజనీష్‌ గుర్బానీ తిరిగి తన సొంత రాష్ట్రం విదర్భకు చేరాడు.

రాబోయే దేశవాళీ సీజన్‌కు ముందు జరుగుతున్న ఈ మార్పులతో పలు రాష్ట్రాల జట్ల కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement