బాచేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం గూర్చి తెలుసుకున్న ఎస్పీ పరితోశ్ పంకజ్ సాయంత్రం ఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకట్రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదాలకు దారితీసే లోపాలు ఏమైనా ఉంటే వెంటనే గుర్తించి వాటిని సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, ఖేడ్, కంగ్టి, సీఐలు శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, ఖేడ్ తహసీల్దార్ చంద్రమోహన్, నిజాంపేట డీటీ వరప్రసాద్, ఆర్ఐ మాధవరెడ్డి, రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు ఉన్నారు.


