తల్లికి వందనం పేరుతో బాబు వెన్నుపోటు: వరుదు కళ్యాణి | YSRCP MLC Varudhu Kalyani Serious Comments On Chandrababu Over Thalliki Vandanam Scheme, More Details Inside | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం పేరుతో బాబు వెన్నుపోటు: వరుదు కళ్యాణి

Jan 3 2025 12:52 PM | Updated on Jan 3 2025 1:39 PM

YSRCP MLC Varudhu Kalyani Serious Comments On Chandrababu

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్‌ విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ పెరిగిపోయాయని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.

వైఎస్సార​్‌సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్‌ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్‌ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement