గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేతలు | YSRCP Legal Cell Leaders Meet Posani Krishna Murali In Guntur Jail | Sakshi
Sakshi News home page

గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేతలు

Mar 15 2025 2:31 PM | Updated on Mar 15 2025 4:44 PM

YSRCP Legal Cell Leaders Meet Posani Krishna Murali In Guntur Jail

గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేతలు శనివారం కలిశారు.

సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని  వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.

‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’  అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

పోసాని అనారోగ్యంగా ఉన్నారు: మనోహర్ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement