వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా తప్పుడు కేసులు: భూమన | YSRCP Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా తప్పుడు కేసులు: భూమన

Dec 1 2024 11:20 AM | Updated on Dec 1 2024 11:51 AM

YSRCP Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu Government

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.

ఆపదలో ఉంటే చెవిరెడ్డే ఆదుకున్నారు: బాధితురాలి తండ్రి 
మేము చెవిరెడ్డిపై ఎలాంటి పోక్సో, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టలేదని.. తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు.
ఆపదలో ఉంటే చెవిరెడ్డే  మమ్మల్ని ఆదుకున్నారని ఆయన  చెప్పారు. ఆదుకున్నవారిపై మేము కేసు పెడితే మహాపాపం అని బాధితురాలి తండ్రి అన్నారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement