సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు, తిరుపతి ఉపఎన్నిక కోసమే బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ హయాంలోనే దేవాలయాల భూ ములు అమ్మేశారని.. గుళ్లు కూల్చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సెంటు కానీ ఒక్క గజం కానీ దేవాలయాల భూమి అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చివేస్తుంటే ఎందుకు మాట్లాడలేదని సోము వీర్రాజును ప్రశ్నించారు. ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ అని మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. ఆరోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆలయాలు కూల్చివేసినప్పుడు బీజేపీలో ఉన్న తాను విజయవాడ బంద్కు పిలుపునిచ్చానని చెప్పారు. ఈ బంద్ పిలుపుతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించిన విష యం వాస్తవం కాదా? అని నిలదీశారు. విజయవాడలో రూ.437 కోట్ల విలువ చేసే 14 ఎకరాల దుర్గగుడి భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు కేవలం రూ.21 లక్షలకు అప్పగించారని.. ఆ సంస్థ ఏమైనా ఉచితంగా బోధిస్తోందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చిన వాటిలోని పలు ఆలయాలను మళ్లీ నిర్మించాలని ఆదేశాలిచ్చామని చెప్పారు.
మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడే..
దేవదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉన్నప్పుడే చాలా చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ విషయం వీర్రాజుకు తెలియదా అని మంత్రి వెలంపల్లి నిలదీశారు. ‘ఆనాడు మంత్రాలయంలోని భూములను అన్యాక్రాంతం చేశారు. దేవాలయ భూములను విశాఖలో ఓ రిసార్టుకు ఇచ్చారు. సదావర్తి భూములైన 83 ఎకరాలను అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ వాస్తవం కాదా?’ అని మంత్రి ప్రశ్నించారు. వీటిని అడ్డుకోవడానికి ఆరోజు పోరాడింది వైఎస్సార్సీపీ నాయకులేనని గుర్తు చేశారు. చర్చీలకు డబ్బులిస్తున్నారని విమర్శిస్తున్న వారికి.. రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్న దుర్గగుడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నందుకు, అన్యాక్రాంత భూములను వెనక్కి తీసుకున్నందుకు తాను రాజీనామా చేయాలా అని మంత్రి ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు.
టీడీపీ హయాంలోనే.. గుళ్లు కూల్చేశారు
Published Thu, Dec 17 2020 5:27 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement