చంద్రబాబుపై మరోమారు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్‌ | Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై మరోమారు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్‌

Jun 12 2025 5:40 PM | Updated on Jun 12 2025 6:52 PM

Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu

సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై మరోమారు టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. గురువారం.. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్‌ సమావేశం జరిగింది. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన-రైతాంగానికి ఇచ్చిన హామీలు- అమలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఎం నాయకులు పి.మధు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైపోయిందని.. రైతులకు 20 వేలు సాయం చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక ఒక ఖరీఫ్, ఒక రబీ సీజన్ అయిపోయాయి. కేంద్రం ఇచ్చేవి కాకపోయినా మీరు ఇస్తామన్న 14 వేలైనా ఇవ్వాలి కదా. గతంలోనూ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండు కిస్తీలు ఎగ్గొట్టేశాడు.

..రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు బోనస్ రూపంలో రైతుకు కొంత సాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనీసం రైతుల గురించి ఆలోచన చేయడం లేదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.

‘‘ఏడాది నుంచి మెట్రో రైలు, రింగ్ రోడ్డు, ఐకానిక్ వంతెనలు అంటూ భజన చేస్తున్నారు. కృష్ణానదిపై 15 కిలోమీటర్లకు ఒక ఐకానిక్ వంతెన కట్టాలని ఓ ఛానల్‌లో చెబుతున్నారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా పిచ్చి ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. ఏదో స్వప్రయోజనం మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఆలోచన చేస్తున్నాడు. భూములను 22ఏలో చేర్చి చిన్ని చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భూములు రైతుల వద్ద కాకుండా.. ప్రభుత్వం వద్దే ఉండాలనేది చంద్రబాబు ఆలోచన.

అమరావతిలో భూములిచ్చిన రైతులకు హామీలిచ్చి మోసం చేశారు. గతంలో గ్రాఫిక్స్‌తో మూడేళ్ల పాటు కథ నడిపించారు. ఇప్పుడు మళ్లీ 45 వేల ఎకరాలు రాజధానికి తీసుకుంటామంటున్నారు. ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కడతామంటున్నారు. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు అవసరమా?. శ్రీకాకుళం ప్రజలకు కావాల్సింది తాగు, సాగునీరు కానీ.. ఎయిర్ పోర్టు కాదు. శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు కడితే సరిపోదు. ఎక్కేవాడు కావాలిగా.. ఇన్నేళ్ల అనుభవమున్న నిన్ను ఏమనుకోవాలి?. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజావ్యతిరేకమైన పిచ్చి ఆలోచనలను మానుకోవాలి’’ అని  వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement