Sakshi News home page

‘నేను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం​ నిర్ణయిస్తుంది’

Published Sat, Oct 14 2023 1:38 PM

Tummala Nageswara Rao Meets Rahul Gandhi - Sakshi

సాక్షి, ఢిల్లీ:  కాంగ్రెస్‌ అధిష్టానం పోటీ చేయమన్న చోట నుంచే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీని కలిసిన అనంతరం మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు తుమ్మల. 

కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తా . పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నాను. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ కోరారు’ అని తెలిపారు. 

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

Advertisement
Advertisement