ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ ‘పోస్టర్‌ ఆవిష్కరణ’ | A tense Congress poster unveiling | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ ‘పోస్టర్‌ ఆవిష్కరణ’

Sep 10 2023 1:42 AM | Updated on Sep 10 2023 1:42 AM

A tense Congress poster unveiling - Sakshi

చార్మినార్‌: చార్మినార్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతిలేదంటూ పోలీసులు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చార్మినార్‌ వద్ద చేపట్టిన ‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే’అనే పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేను పోలీసులు గుల్జార్‌హౌస్‌ వద్ద అడ్డుకున్నారు.

ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పడంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో పాటు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు అక్కడ నిరసన తెలపడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సిటీ కాలేజీ వరకు తరలించి వదిలేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement