
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంటికి టీడీపీ నేతలు తెలుగుదేశం జెండా కట్టారు. టీడీపీ జెండా తీసేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కోరగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్తో వాదనకు దిగారు.
దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి రాళ్లు రువ్వారు. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు.