అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు | TDP Leader Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Jun 7 2025 3:08 PM | Updated on Jun 7 2025 5:24 PM

TDP Leader Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu

సాక్షి, విజయవాడ:  అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. 

రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.

అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే  పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్‌గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.

అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.

	అవసరానికి మించి అమరావతిలో భూసేకరణ: వడ్డే

భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా  ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్‌లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.

శంషాబాద్‌లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక  ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement