టీడీపీలో వారిని వదలను.. ప్రసాద్‌ బాబు సంచలన వ్యాఖ్యలు | Sugavasi Prasad Babu Sensational Comments On TDP, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీలో వారిని వదలను.. ప్రసాద్‌ బాబు సంచలన వ్యాఖ్యలు

Jun 14 2025 11:09 AM | Updated on Jun 14 2025 12:38 PM

sugavasi prasad babu Sensational Comments On TDP

సాక్షి, అన్నమయ్య: టీడీపీ అధికార కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నేతలపై టీడీపీ సీనియర్‌ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. సంవత్సర కాలంగా పార్టీలో అవమానాలను భరిస్తున్నాం.. తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను అని హెచ్చరించారు.

చిన్నమండ్యంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సంస్మరణ సభలో టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తన ఆగ్రహం వెల్లగక్కారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సొంత గడ్డపై మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి చనిపోయే వరకు పార్టీ కోసమే కష్టపడిన నాయకుడు పాలకొండ్రాయుడు. అలాంటి ‍వ్యక్తి కుటుంబ సభ్యులం మేము. తెలుగుదేశం పార్టీలోనే మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.

మా అన్న సుగవాసి సుబ్రహ్మణ్యంను పార్టీలోని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెట్టారు. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఏడాది పాటు పార్టీలో అవమానాలను భరించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లో ఆదరణ లేనట్టా. పలు చోట్ల టీడీపీ ఇన​్‌ఛార్జ్‌లు ఓడిపోలేదా?. అయినప్పటికీ వారు ఇన్‌చార్జ్‌ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఒక్క రాజంపేటలో మాత్రమే ఇన్‌ఛార్జ్‌ పదవి ఎందుకు ఇవ్వలేదు. ఓడిపోతే ఇలా అవమానిస్తారా?. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

టీడీపీ బాల సుబ్రహ్మణ్యం రాజీనామా..
ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక, ఆయన 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి విధితమే.

మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. పాలకొండ్రాయుడు 1984 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్‌‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి పార్టీ నేతలు మూడు గ్రూపులోగా విడిపోయారనే టాక్ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement