నీరు–చెట్టు, అమరావతి పేరిట రూ.2,300 కోట్ల స్కామ్‌: సోము

Somu Veerraju Comments On Chandrababu Naidu - Sakshi

పెదవాల్తేరు (విశాఖ తూర్పు)/శ్రీకాకుళం రూరల్‌/సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు, అమరావతి స్మార్ట్‌ సిటీ పేరిట రూ.2,300 కోట్ల స్కామ్‌ జరిగిందని, కేంద్ర నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు పాత్ర ఉందని సోము వీర్రాజు ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మతాలకు అతీతంగా విజయాలు సాధించామని విశాఖలో సోము వీర్రాజు పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top